ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

TS ECET 2020 Schedule Released From JNTUH - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 31న రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్‌లో పరీక్ష ఉండనుంది. కంప్యూటర్ ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52, ఏపీలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top