
2.5 లక్షల మందిపై చార్జీల భారం
ప్రయాణికుల్లో తీవ్ర వ్యతిరేకత
సాక్షి, హైదరబాద్: ఆర్టీసీ బస్పాస్ ధరలను భారీగా పెంచేసింది. ఈ పెంపు గ్రేటర్లోని సుమారు 2.5 లక్షల మందిపై పిడుగుపాటుగా మారింది. అకస్మాత్తుగా చార్జీలను 20 శాతం పెంచడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆరీ్టసీలో నగదు నిల్వలు దారుణంగా పడిపోవడంతో బస్సుల నిర్వహణ, విడిభాగాల కొనుగోళ్లు, డిపోల రోజువారీ ఖర్చులు తదితర అవసరాలకు కష్టంగా మారింది.
ఈ క్రమంలో ఒకవైపు పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్న ఆర్టీసీ అధికారులు.. తాజాగా బస్పాస్లపై దృష్టి సారించారు. ప్రతి నెలా బస్పాస్ చార్జీల రూపంలో నగదు ఆదాయం లభించనున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బస్పాస్ చార్జీల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కొత్త చార్జీలు ఇలా..
సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వినియోగించే ఆర్డినరీ నెలవారీ పాస్ రూ.1,150 నుంచి రూ.1,400కు పెరిగింది. మెట్రో ఎక్స్ప్రెస్ రూ.1,300 నుంచి రూ.1,600కు చేరింది. మెట్రోడీలక్స్ రూ.1,450 నుంచి రూ.1,800. మెట్రో లగ్జరీ (ఏసీ) రూ.1,800 నుంచి రూ.2,200. విద్యార్ధుల నెలవారీ ఆర్డినరీ పాస్ రూ.400 నుంచి రూ.600కు పెరిగింది. క్వార్టర్లీ (మూడు నెలలు) పాస్ రూ.1,200 నుంచి రూ.1,800. గ్రేటర్ హైదరాబాద్ ఆర్డినరీ రూ.470 నుంచి రూ.705కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్ రూ.1,350 నుంచి రూ.1,950కి చేరింది. ఆర్డినరీ స్పెషల్ పాస్ రూ.450 నుంచి రూ.650. ఎన్జీఓల నెలవారీ ఆర్డినరీ బస్పాస్ రూ.400 నుంచి రూ.600, మెట్రో ఎక్స్ప్రెస్ రూ.550 నుంచి రూ.800, మెట్రో డీలక్స్ పాస్ రూ.700 నుంచి రూ.1000కి పెంచారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడిచే పుష్పక్ ఏసీ బస్సుల పాస్ ధర రూ.5000 ఉంది. ఆర్టీసీ అధికారులు ప్రస్తుతానికి పుష్పక్ పాస్ జోలికి వెళ్లలేదు.