ఉద్యమకారులపై కేసులా?  | Telangana: TRS Leader Jupally Krishna Rao About Cases Against Udyamakarula | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులపై కేసులా? 

Dec 8 2022 2:38 AM | Updated on Dec 8 2022 2:38 AM

Telangana: TRS Leader Jupally Krishna Rao About Cases Against Udyamakarula - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలో ఉద్యమకారులపై కుట్రలతో కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, అయితే రాష్ట్రంలో ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదని విమర్శించారు.

తిండి లేకున్నా ఉంటాం కానీ, ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని వ్యాఖ్యానించారు. తాను రెండు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ‘జూపల్లి మరో ప్రస్థానం’పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement