
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.91లక్షలకు చేరుకున్నది. తాజాగా 41మంది కోలుకోగా, మొత్తం 7.87లక్షల మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 260 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి.