ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో A2 భుజంగరావుకు ఊరట | Telangana Phone Tapping Case: Bhujanga Rao Gets Relief | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో A2 భుజంగరావుకు ఊరట

Aug 19 2024 11:05 AM | Updated on Aug 19 2024 11:31 AM

Telangana Phone Tapping Case: Bhujanga Rao Gets Relief

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ2 నిందితుడు భుజంగరావుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది నాంపల్లి క్రిమినల్‌ కోర్టు.

ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. 

గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజులపాటు బెయిల్‌ ఇస్తున్నట్లు కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లకూడదనే షరతు విధించింది. ఈ కేసులో మొదట అరెస్ట్‌ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్‌ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్‌ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్‌ కార్నర్‌ నోటీసులు సైతం జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement