
విద్యా కేలండర్ విడుదల చేసిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం (2025–26) టెన్త్ పరీక్షలను 2026 మార్చిలో నిర్వహించాలని విద్యాశా ఖ నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నాటికి మొత్తం సిలబస్ బోధన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. విద్యాశాఖ 2025–26 విద్యా సంవత్సరం కేలండర్ను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీన మొదలయ్యే పాఠశాలలు 2026 ఏప్రిల్ 23వరకు నడుస్తాయని, మొత్తం 230 పనిదినాలు ఉంటాయని వెల్ల డించింది.
స్కూళ్లలో ప్రతిరోజూ 5 నిమిషాలపాటు విద్యా ర్థులకు మెడిటేషన్ చేయించాలని సూచించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలువులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. 2026 జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.