‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే | Telangana High Court Stayed Sirpurkar Commission Report In Disha Case | Sakshi
Sakshi News home page

‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే

May 1 2024 4:17 PM | Updated on May 1 2024 9:19 PM

Telangana High Court Stayed Sirpurkar Commission Report In Disha Case

‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

సాక్షి, హైదరాబాద్‌:దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై  పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్‌ స్టే ఇచ్చింది.

10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో క‌మిష‌న్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని క‌మిష‌న్‌ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్‌కౌంటర్‌ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్‌లో లోపాలు ఉన్నాయన్న కమిషన్‌..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని  రిపోర్టు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్‌.. అప్పటి ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్‌ రిపోర్ట్‌పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement