
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్పై ఉట్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను తాజాగా హైకోర్టు కొట్టేసింది. దీంతో, కేటీఆర్కు ఉపశమనం దక్కింది.
వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్పై ఉట్నూరు పీఎస్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం 25వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఊట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.