మెదక్‌లో రోడ్డు ఘోర ప్రమాదం | Telangana Crime News: Medak's Chegunta Lorry Accident On June 28 Details | Sakshi
Sakshi News home page

మెదక్‌లో ఘోర ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. మరో నలుగురికి సీరియస్‌

Jun 28 2024 6:58 AM | Updated on Jun 28 2024 8:57 AM

Telangana Crime News: Medak's Chegunta Lorry Accident On June 28 Details

మెదక్, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీ ఢీ కొట్టడంతో నలుగురు  దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ వేగంగా ఢీ కొట్టింది. వెనుకలారీలో ఉన్న అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement