సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అమీర్పేట్-రాయదుర్గం మార్గంలో అంతరాయం ఏర్పడింది. జూబ్లీచెక్ పోస్టు దగ్గర మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో రెండు వైపులా కూడా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.
కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ అంతరాయం కలగడంతో ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరించే పనిలో ఉందని.. కొద్దిసేపట్లో సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో అధికారులు తెలిపారు.



