
సాక్షి, హైదరాబాద్: దీపావళి, ఛట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడప నున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07497/ 07498), విజయవాడ–సికింద్రాబాద్ (0721 3/07214) మధ్య ఈ నెల 17, 18 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. అలాగే హైదరాబాద్–భువనేశ్వర్ (07165/07166) ఎక్స్ప్రెస్ నవంబర్ 4వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాకపోకలు సాగించనుంది.