సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాధారణంగా రహదారులపై నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడ్డవారి వాహనాలను ఆ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచుతారు. అలా పోలీసులు సీజ్ చేసి అక్కడ ఉంచిన బైక్లు, ఆటోలు, కార్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకుంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగితే అవకాశాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేస్తుంటారు. అటువంటిది పోలీస్ స్టేషన్లోనే అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం.


