సాక్షి, సిటీబ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా కీసర, ఏడుపాయల జాతర, బీరంగూడ జాతరలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్, అమ్ముగూడ, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్ నుంచి కీసర, ఏడుపాయాల జాతరకు 330 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు.అలాగే సీబీఎస్, పటాన్చెరు నుంచి 155 బస్సులు బీరంగూడ జాతరకు నడుస్తాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 17 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.


