Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఆరుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఈవీ వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజా శరత్, జె.శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావు ఉన్నారు. న్యాయాధికారుల పేర్లను కొలీజియం.. కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు.
చదవండి: భట్టీతో భేటీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు