స్థానిక ఎన్నికల్లో ‘సిరా’ చుక్కపై ఎస్‌ఈసీ స్పష్టత | SEC clarifies on ink in local elections: Telangana | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో ‘సిరా’ చుక్కపై ఎస్‌ఈసీ స్పష్టత

Oct 7 2025 6:17 AM | Updated on Oct 7 2025 6:17 AM

SEC clarifies on ink in local elections: Telangana

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమచెయ్యి  చూపుడు వేలుపై.. 

పంచాయతీ ఎన్నికల్లో మధ్యవేలుపై చుక్క వేయాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 23, 27 తేదీల్లో (రెండుదశల్లో) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓటింగ్‌ సందర్భంగా వేలిపై సిరా చుక్క వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టతను ఇచి్చంది. ఈ నెల 23న తొలిదశ మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్‌ సందర్భంగా ఓటర్‌ ఎడమచెయ్యి చూపుడు వేలుపై వేసిన ఓటుకు గుర్తుగా సిరా చుక్క వేయాలని ఎన్నికల అధికారులకు తెలిపింది.

ఆ తర్వాత ఈ నెల 31, నవంబర్‌ 4, 8 తేదీల్లో జరగనున్న మూడుదశల గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటరు మధ్యవేలుపై సిరాచుక్క వేయాలని పేర్కొంది. ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందు ఈ మేరకు ఓ సర్క్యులర్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, రిటరి్నంగ్‌ అధికారులకు సమాచారం పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement