
నిజాంపేట్: అది వేంకటేశ్వర స్వామి సన్నిధి.. భక్తులకు పెన్నిధి.. ఆలయ ప్రాంగణం వేదికగా పంచాంగ శ్రవణం.. స్థానికులు భారీగా తరలివచ్చి శ్రద్ధాసక్తులతో వీక్షించారు. ఇదీ ఆదివారం సాయంత్రం బాచుపల్లిలోని క్రాంతినగర్ కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కనిపించిన సన్నివేశం. ‘సాక్షి’మీడియా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది. ‘సాక్షి’డైరెక్టర్ రాణిరెడ్డి, ఆలయ చైర్మన్ కాంతారావు, సర్క్యులేషన్ జీఎం కీర్తికిరణ్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం చేసిన కళాత్మక కూచిపూడి నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.
అనంతరం సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్సాచార్యులు పంచాంగ పఠనం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో రాశిఫలాల గురించి చాలా విపులంగా వివరించారు. ‘విశ్వాసం అని నామధేయంతో ఈ సంవత్సరముంది. విశ్వాసులు అంటే సూర్యుడి ప్రజ్వలితం ఏ «విధంగా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అంతే ప్రజ్వలితంగా ఉంటుంది. అందరి జీవితాల్లో విశ్వావసు అంత గొప్ప వెలుగును నింపుతుంది.
12 రాశుల వారికి 12 స్థానాల్లో శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అనంతరం అన్ని రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజయోగం, అవమానం ఏ యే స్థాయిల్లో ఉందో వివరించారు. తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సరర్గా వ్యవహరించింది. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ మేనేజర్ వినోద్కుమార్, మహేశ్రెడ్డి, స్థానిక నాయకులు జీవీ రెడ్డి, కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జైపాల్రెడ్డి, సంగమేశ్, మహేశ్, వెంకటేశ్, భూపతి, చరణ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
రాశి ఫలాలు తెలుసుకున్నాం..
ఉగాది పండుగ సందర్భంగా మా కాలనీలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. పంచాంగంతో మా రాశుల ఫలాలు తెలుసుకున్నాం. సిద్ధాంతి గారి ఆధ్యాతి్మక ప్రసంగం ఎంతో ఆలోచింపజేయడంతోపాటు ఆచారించాల్సిన ఆవశ్యకతను తెలిపింది.
– జి.ప్రసన్న, క్రాంతినగర్
అవగాహన కలిగింది..
శుభ ముహూర్తాలు, అందులో గ్రహాల బలాల వల్ల జరిగే ఫలితాలు బాగా అర్థమయ్యాయి. సాక్షి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు రాశి ఫలాలపట్ల అవగాహన ఏర్పడింది.
–ఎ.ఊర్మిళ
చాలా సంతోషంగా ఉంది..
ఉగాది పండుగను ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి మీడియా ఆ«ధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాదిని ఈ విధంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం. తెలుగు పండుగల ప్రాధాన్యతను ఇలా చాటి చెప్పడం మంచి పరిణామం. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఈ పంచాంగ
శ్రవణంలో పాల్గొన్నారు.
– కాంతారావు, ఆలయ కమిటీ చైర్మన్, క్రాంతినగర్
‘సాక్షి’ చొరవ అభినందనీయం
ప్రతి నిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సాక్షి మీడియా ఎంతగానో
కృషి చేస్తోంది. వాటితోపాటు పండుగలను నిర్వహిస్తూ తెలుగు సంప్రదాయాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం.
– నందిగామ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బాచుపల్లి