
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విశిష్ట సంస్కృతికి నిలయం. కష్టపడి పనిచేసే తత్వమున్న తెలంగాణ ప్రజలు అనేక రంగాలలో రాణించారు. వారికి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
చదవండి: బ్లాక్ఫంగస్ బాధితుడికి కేటీఆర్ అండ..
Best wishes to the people of Telangana on the state’s Formation Day. The state is blessed with a unique culture and hardworking people who have excelled in many areas. Praying for the good health and well-being of the people of Telangana.
— Narendra Modi (@narendramodi) June 2, 2021