
సిరిసిల్లటౌన్: మార్కెట్లో రూ.20 నాణేలు చలామణి అవుతున్నాయి. కొత్తగా ఈ కాయిన్స్ వచ్చినట్లు చాలా మందికి తెలియక అయోమయానికి గురవుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వీటిని మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసంది. కాస్త చిన్న సైజులోనే రూ.5 కాయిన్స్ కూడా చలామణి అవుతున్నాయి. రెండు చిన్నపాటి మార్పులతో ఉండడంతో ప్రజలు తికమకపడుతున్నారని చర్చించుకుంటున్నారు.