భోజనం కోసం రోడ్డెక్కిన యూనివర్సిటీ విద్యార్థులు | osmania university students protest for hostel food | Sakshi
Sakshi News home page

భోజనం కోసం రోడ్డెక్కిన యూనివర్సిటీ విద్యార్థులు

Dec 2 2025 11:24 PM | Updated on Dec 2 2025 11:24 PM

osmania university students protest for hostel food

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు  రోడ్కెక్కారు. మంగళవారం రాత్రి వడ్డించిన భోజనం చాలా నాసికరంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తమకు పాడైపోయిన భోజనం పెడుతున్నారని ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్ధులు  బైఠాయించారు. ఆహారం విషయంలో ఎలాంటి నాణ్యత లేదని ఆపై హాస్టల్‌ కూడా కనీస మౌలిక వసతులు లేవని తెలిపారు. యూనివర్సిటీలోని సమస్యల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్ కూడా పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్‌ తెలిపారు.


హాస్టల్‌లో పాడైపోయిన ఆహారాన్నే తరుచుగా వడ్డించడం వల్లే తాము అనారోగ్యానికి గురవవుతున్నామని విద్యార్థులు వాపోయారు. రాత్రి సమయంలో బోజనం కోసం విద్యార్థులు రోడెక్కడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement