జేఈఈ అర్హతలో స్వల్ప మార్పులు | Minor Changes in JEE Mains Eligibility | Sakshi
Sakshi News home page

జేఈఈ అర్హతలో స్వల్ప మార్పులు

Jan 12 2023 5:25 AM | Updated on Jan 12 2023 8:20 AM

Minor Changes in JEE Mains Eligibility - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ అర్హత నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జేఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశాలు పొందేప్పుడు ఇంటర్‌లో 75 శాతం మార్కులు పొంది ఉండాలని ఎన్‌టీఏ తొలుత పేర్కొంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదం చెలరేగింది.

ఆయా రాష్ట్రాల్లో ఇంటర్, 10 ప్లస్‌టులో గరిష్టంగా 60 శాతం పర్సంటైల్‌ మాత్రమే వస్తోంది. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్, ప్లస్‌ టులోని సబ్జెక్టుల్లో 75 మార్కులు లేదా టాప్‌ 20 పర్సంటైల్‌ ఉన్నవారు జాతీయ సీట్ల కేటాయింపునకు అర్హులని ఎన్‌టీఏ మార్పు చేసింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్, ప్లస్‌టులో 65 మార్కులు పొంది ఉంటే సరిపోతుందని నిర్ణయించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement