
ఉరి వేసుకుని ప్లంబర్ ఆత్మహత్య
నిజామాబాద్: క్రెడిట్ కార్డు నోటీసులు రావడంతో ఆందోళన చెందిన ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బండాగల్లీకి చెందిన బశప్ప (35) క్రెడిట్ కార్డుపై రూ.70 వేలు అప్పు చేసాడు. గడువు దాటినా అప్పు చెల్లించకపోవడంతో బశప్పకు నోటీసులు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన బశప్ప గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్లంబర్గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.