మమ్మల్ని ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది: కేటీఆర్‌ | KTR Alleges Government Tried To Block Kannepalli Visit, Demands Lifting Of Godavari Waters | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది: కేటీఆర్‌

Jul 5 2026 3:51 PM | Updated on Jul 5 2026 4:28 PM

KTR comments at Kannepalli Tour

కన్నెపల్లికి తాము రాకుండా ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్‌ను వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వృథాగా పోతున్న జలాలను పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘‘తుమ‍్మిడిహెట్టి కోసం మహారాష్ట్రతో జలదౌత్యం చేశాం. నీళ్లు పల్లమెరుగు అనే నానుడిని తప్పు అని కేసీఆర్‌ నిరూపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నీళ్లు తీసుకొచ్చాం. నీళ‍్లు ఎత్తేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఈ రాష్ట్రానికి కేసీఆర్‌ ఇచ్చిన వరం కాళేశ్వరం’’ అని తెలిపారు. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement