
త్వరలో మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వం ఏర్పాటుచేసే యోచన
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం రాహుల్ దగ్గర’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందని, సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలనుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
ఒకవేళ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే 25–30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ కాంగ్రెస్ను వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని, త్వరలో ఇది జరగబోతుందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో పాల్ విలేకరులతో మాట్లాడారు.