ఐఏఎస్‌ అధికారికి మాతృవియోగం

IAS Officer Mother Passaway Tragedy In Warangal - Sakshi

సాక్షి,జనగామ(వరంగల్‌): ఐఏఎస్‌ అధికారి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తల్లి గౌరమ్మ(85) మంగళవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. అక్కడ నుంచి జనగామ మండలం ఓబుల్‌కేశ్వాపూర్‌ గ్రామం స్వగ్రామానికి ఆమె మృతదేహాన్ని తీసుకువచ్చారు. నేడు(బుధవారం) గౌరమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వెంకటేశంను సీఎం కేసీఆర్‌తో పాటు చీఫ్‌ సెక్రెటరీ, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు,  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య  పరామర్శించారు. గౌరమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రభుత్వ అధ్యాపకుడిగా పని చేస్తుండగా, రెండో కుమారుడు వెంకటేశం ఐఏఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top