ఎయిర్‌ఫోర్స్‌ అధికారికి కరోనా.. ఆత్మహత్య | Hyderabad Air Force Employee Test Corona Positive Suicide Attempt | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి భవనం పై నుంచి దూకి మృతి చెందిన కరోనా రోగి

Jul 23 2020 3:20 PM | Updated on Jul 23 2020 3:30 PM

Hyderabad Air Force Employee Test Corona Positive Suicide Attempt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగి ఒకరు ఆస్పత్రి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నాగేంద్ర ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం నాగేంద్ర ఆస్పత్రి బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో చెట్ల మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సిబ్బంది నాగేంద్రను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. వైద్యం పొందుతూ అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (సొంతూరికెళ్లి...వీధులన్నీ తిరిగి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement