ఆస్పత్రి భవనం పై నుంచి దూకి మృతి చెందిన కరోనా రోగి

Hyderabad Air Force Employee Test Corona Positive Suicide Attempt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగి ఒకరు ఆస్పత్రి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నాగేంద్ర ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం నాగేంద్ర ఆస్పత్రి బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో చెట్ల మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సిబ్బంది నాగేంద్రను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. వైద్యం పొందుతూ అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (సొంతూరికెళ్లి...వీధులన్నీ తిరిగి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top