సాక్షి, సిరిసిల్ల : ఎల్లారెడ్డి పేట మండలం పదిరలో దారుణం జరిగింది. ఈ రోజు ( బుధవారం)కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన అత్తపైన దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన అత్తను ఆసుపత్రికి తరలించారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


