ఉపరాష్ట్రపతిని కలిసిన గవర్నర్‌ తమిళిసై 

Governor Tamilisai Soundararajan Meets Vice President Jagdeep Dhankhar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీ వచ్చిన తమిళిసై తొలుత నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌–కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ‘న్యూఢిల్లీ వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌–­2023’ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ పుస్తక ప్రదర్శనలో పార్లమెంట్‌ లైబ్రరీ, పార్లమెంట్‌ మ్యూజియం–ఆర్కైవ్స్‌ ఏర్పా­టు చేసిన స్టాల్‌ను పరిశీలించారు.

ప్రతిఒక్క­రూ పుస్తకాల సేకరణ, పుస్తకాలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని గవ­ర్నర్‌ తెలిపారు. అంతేగాక ప్రతిఒక్కరూ ఇంట్లో లైబ్రరీని కలిగి ఉండాలని, చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూ­చించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top