
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపనపల్లి(Gopanpally) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం(Road Accident) సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: భర్తకు మెసేజ్ పెట్టి బలవన్మరణం