Crime News | Tragedy on Friendship day | Friends drowned in Godavari River - Sakshi
Sakshi News home page

విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్‌ డే

Aug 2 2021 1:13 AM | Updated on Aug 2 2021 2:54 PM

Friends Who Went To Sriram Sagar Backwater Area Drowned At Nizamabad - Sakshi

ప్రమాదానికి ముందు యువకులు తీసుకున్న సెల్ఫీ

నందిపేట్‌(ఆర్మూర్‌): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్‌ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్‌(19), ఉదయ్‌(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు.

స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్‌ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్‌ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్‌ అనిల్‌ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement