సాక్షి, హైదరాబాద్: ఈ రోజు (సోమవారం) జరిగిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తలెత్తి వాగ్వాదం జరిగింది. అభిప్రాయాలు, సూచనల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మైక్ లు లాక్కొని తోపులాటకు దిగారు. ఎమ్మెల్సీ కోదండరాం, కేశవరావు సర్థిచెప్పినా విద్యార్ధి సంఘ నాయకులు వినిపించుకోలేదు.


