కాలేజీ భవనం పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | Engineering student jumps to death at Telangana college: Suryapet | Sakshi
Sakshi News home page

కాలేజీ భవనం పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 20 2025 12:55 AM | Updated on Apr 20 2025 12:55 AM

Engineering student jumps to death at Telangana college: Suryapet

చిలుకూరు: తాను చదువు కుంటున్న కళా శాల భవనం పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థి ని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరి ధిలోని రామాపురం వద్ద గేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. మంచి ర్యాల జిల్లా జైపూర్‌ మండలం పెగడప ల్లికి చెందిన లింగయ్య–లక్ష్మి దంపతుల కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె కృష్ణవే ణి (21) గేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (సీఎస్‌ఈ) థర్డ్‌ ఇయర్‌ చదువు తూ హాస్టల్‌లో ఉంటోంది.

ఉగాది రోజు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి.. తిరిగి శుక్రవారం రాత్రి తన తల్లి లక్ష్మితో కాలేజీ హాస్టల్‌కు వచ్చి ఆమెతో కలిసి నిద్రపోయింది. ఉదయం 6 :30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి రూంలో నుంచి బయటకు వెళ్లి కళాశాల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. దీంతో కృష్ణవేణి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తోటి విద్యార్థులు కళాశాల యాజమా న్యానికి, అధ్యాపకులకు తెలియజే యగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి వచ్చిన చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు మృతురాలి తల్లి, తోటి విద్యార్థులతో మాట్లా డి విచారణ చేశారు. ఉదయం వాష్‌రూ మ్‌కు అని వెళ్లిన తన బిడ్డ కొద్ది సేపటికే ఇలా మృతి చెందిందని తల్లి రోదించింది. కృష్ణవేణి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి గత కారణాల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement