breaking news
B.tech student suscide
-
కాలేజీ భవనం పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
చిలుకూరు: తాను చదువు కుంటున్న కళా శాల భవనం పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరి ధిలోని రామాపురం వద్ద గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. మంచి ర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడప ల్లికి చెందిన లింగయ్య–లక్ష్మి దంపతుల కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె కృష్ణవే ణి (21) గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) థర్డ్ ఇయర్ చదువు తూ హాస్టల్లో ఉంటోంది.ఉగాది రోజు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి.. తిరిగి శుక్రవారం రాత్రి తన తల్లి లక్ష్మితో కాలేజీ హాస్టల్కు వచ్చి ఆమెతో కలిసి నిద్రపోయింది. ఉదయం 6 :30 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి రూంలో నుంచి బయటకు వెళ్లి కళాశాల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. దీంతో కృష్ణవేణి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తోటి విద్యార్థులు కళాశాల యాజమా న్యానికి, అధ్యాపకులకు తెలియజే యగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి వచ్చిన చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు మృతురాలి తల్లి, తోటి విద్యార్థులతో మాట్లా డి విచారణ చేశారు. ఉదయం వాష్రూ మ్కు అని వెళ్లిన తన బిడ్డ కొద్ది సేపటికే ఇలా మృతి చెందిందని తల్లి రోదించింది. కృష్ణవేణి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి గత కారణాల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఆంగ్ల మాధ్యమం చదవలేక అఘాయిత్యం ముస్తాబాద్(కరీంనగర్): ఇంగ్లిష్ మీడియం చదువు ఆ విద్యార్థిపాలిట శాపమైంది. తల్లిదండ్రుల కోరిక కాదనలేక.. ఇటు చదవలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనా ఓ బీటెక్ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఇమడలేక అందులో చేరిన నాలుగు రోజులకే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్సై ప్రవీణ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాబాద్కు చెందిన సూర నరేశ్(18) శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నరేశ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సూర కనుకవ్వ, సాయిలు దంపతులకు ఇద్దరు కుమారులు రాజశేఖర్, నరేశ్. రాజశేఖర్ ఉపాధి నిమిత్తం దుబాయ్కు వెళ్లొచ్చాడు. చిన్న కుమారుడు నరేశ్ను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు భావించారు. గత నెల 27న హైదరాబాద్లోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఓ హాస్టల్ను ఉంచారు. క్లాసులు అర్థం కావడంలేదురా.. నరేశ్ హైదరాబాద్లో హాస్టల్లో ఉండగా.. అక్కడ తనకు ఇంగ్లిష్లో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది అని తన స్నేహితులకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. కాలేజీకి వెళ్లబుద్ధికావడం పేర్కొన్నాడు. వినాయక చవితి పండుగ కోసమని సెలవు పెట్టి గురువారం స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి బాగానే ఉన్న నరేశ్ను కాలేజీలో ఎలా ఉందని తల్లి కనుకవ్వ వాకబు చేసింది. అంతా బాగుందని నరేశ్ చెప్పాడు. శుక్రవారం ఉదయం పనులపై తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నరేశ్ ఉరేసుకున్నాడు. తమ ఇంట్లో ఎవరూ చదవలేదని, బాగా చదివి ప్రయోజకుడవుతాడని తమ కొడుకును హైదరాబాద్లో బీటెక్లో చేర్పించామని, కొడుకు మనసు అర్థం చేసుకోలేక పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, నరేశ్ కాలేజీకి కూడా ఒక్క రోజే వెళ్లాడని, హాస్టల్లో తనతోపాటు ఉంటున్న నలుగురు స్నేహితులు పేర్కొన్నారు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని చెప్పాడని, ఇంతలో ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.