మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల‌

Election Commission of India Released Notification For Munugode Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడులైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడించింది. ఇక నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌, 6న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

చండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. శని, ఆదివారం నామినేషన్ల దాఖలుకు సెలవు ఉంటుంది. ఈనెల 14వ తేదీ వరకు జరగనున్న నామినేషన్ల స్వీకరణకు 30 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. చండూరు పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.  నామినేషన్‌ వేసే అభ్యర్థుల వెంట అయిదుగురికి మాత్రమే రిటర్నింగ్‌ కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. 

టీఆర్‌ఎస్‌ అ‍భ్యర్థి ఖరారు
మరోవైపు మునుగోడు ఉపఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలుపొందగా. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.. ప్రస్తుంగా మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి ‍స్రవంతి పోటీ చేస్తున్నారు.

అక్టోబర్‌ 10న బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. 14న కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 13 లేదా 14వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top