Twist In IRS Officer Samuel Prasad Home Money Theft Case, Details Inside - Sakshi
Sakshi News home page

IRS అధికారి ఇంట చోరీ కేసులో కొత్త కోణం.. ఎస్‌ఐ కృష్ణ స్కెచే ఇది..

Jun 30 2023 12:39 PM | Updated on Jun 30 2023 1:17 PM

Twist In IRS Officer Samuel Prasad Home Money Theft Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతం కేసులో ఎస్‌ఐ కృష్ణనే సూత్రదారిగా పోలీసు అధికారులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి రూ.100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇక, ఈ కేసులో సురేందర్‌ను విచారించడంతో వెలుగులోకి ఎస్‌ఐ కృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 30న శామ్యూల్‌కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. 

ఇక, ఈ డాక్యుమెంట్లను కృష్ణకు అందించాడు సురేందర్‌. కాగా, సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పోలీసులు సేకరించారు. మరోవైపు.. సురేందర్‌ చోరీ చేసన సొమ్ముతో గోవా వెళ్లి క్యాసినో ఆడినట్టు తెలిపాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు చెప్పాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. ఎస్‌ఐ కృష్ణా, సురేందర్‌ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌, బీజేపీకి షాక్‌!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement