140 మంది టీచర్లకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

140 మంది టీచర్లకు సన్మానం

Sep 8 2026 1:35 AM | Updated on Sep 8 2026 1:35 AM

– ఒకరికి కై ండ్‌ జీవిత సాఫల్య

పురస్కారం ప్రదానం

సాక్షి, చైన్నె: చైన్నె వేప్పేరనిలో కై ండ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల పాఠశాలలకు చెందిన 140 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మొత్తం 400 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకలో తరలి వచ్చారు. లంక డిప్యూటీ హైకమిషనర్‌ గణేశానందన్‌ గీతీశ్వరన్‌ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న కై ండ్‌ సంస్థ సేవలను ఆయన కొనియాడారు.

జీవిత సాఫల్య పురస్కారం

గత 5 దశాబ్దాలుగా ఉచిత వైద్యసేవలు అందిస్తూ లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేసిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, అమృత్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ సోహన్‌ లాల్‌ జీకి లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఈ సందర్భంగా ప్రదానం చేశారు. ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల కోంస ఉచితంగా వైద్య సలహాలు, మందులు ఫిజియోథెరపీ సౌకర్యాలతో త్వరలోనే ప్రత్యేక క్లినిక్‌ను ప్రారంభించనున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అన్నా విశ్వవిద్యాలయ డైరెక్టర్‌ డాక్టర్‌ అరివుడైనంబి, ప్రొఫెసర్‌ ఆర్‌.ఎల్‌. గోధారా, డాక్టర్‌ అరుణ్‌ పిచ్చై నారాయణన్‌, సభాధ్యక్షత వహించిన సుభాష్‌ రంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement