అల్పాహారం పథకం విస్తరణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అల్పాహారం పథకం విస్తరణకు చర్యలు

Aug 30 2026 1:27 AM | Updated on Aug 30 2026 1:27 AM

● సీఎం విజయ్‌ నిర్ణయం

సాక్షి, చైన్నె : కర్మయోగి కామరాజర్‌ అల్పాహార పథకం విస్తరణ అమలుకు చర్యలు చేపట్టారు. సెప్టెంబరు 17వ తేదిన పెరియార్‌ జయంతి సందర్భంగా విరుదు నగర్‌లో ఈ విస్తరణ పథకం అమలుకు సీఎం విజయ్‌ శ్రీకారం చుట్టనున్నారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సీఎం అల్పాహారపథకంను డీఎంకే హయంలో అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.వి జయవంతంగా అమలులలో ఉన్న ఈ పథకానికి టీవీకే ప్రభుత్వం పేరు మార్చింది. కర్మయోగి కామరాజర్‌ అల్పాహార పథకం గా పేరు మార్చడమే కాకుండా ఈ పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తున్నట్లు సీఎం విజయ్‌ ప్రభుత్వం ప్రకటించి. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ. 268 కోట్లు కేటాయించారు. ఈపరిస్థితులలో పెరియార్‌ జయంతి రోజైన సెప్టెంబర్‌ 17న ఈ పథకం విస్తరణను సీఎం విజయ్‌ అధికారికంగా ప్రారంభించనున్నారు. విరుదునగర్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్మయోగి కామరాజర్‌ చదువుకున్న కే.వి.ఎస్‌. మిడిల్‌ స్కూల్‌లో ఈ విస్తరణ కార్యక్రమాన్ని సీఎం విజయ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారాలు వెలువడ్డాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌ దక్షిణ తమిళనాడు జిల్లాల్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement