– తమిళనాడుకు చెందిన ప్రముఖ మొబైల్ డీలర్లు దుర్మరణం
సాక్షి, చైన్నె: విహారయాత్ర కోసం వియత్నాం వెళ్లిన తమిళనాడుకు చెందిన మొబైల్ ఫోన్ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు పడవ బోల్తా పడిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఒకే మొబైల్ కంపెనీకి చెందిన డీలర్లు, మేనేజర్లు అందరూ కలిసి జూలై 8వ తేదీ రాత్రి వియత్నాం పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తిరుచ్చి, సేలం, ధర్మపురి, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.
ఉదయం పుట్టినరోజు శుభాకాంక్షలు..
సాయంత్రానికి నివాళులు
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ధర్మపురి జిల్లాకు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్ సెంథిల్కుమార్ (45) ఒకరు. శనివారం ఆయన పుట్టినరోజు కావడంతో ఉదయం బంధువులు, స్నేహితులు వాట్సాప్, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషం పంచుకున్నారు. అయితే, సాయంత్రానికే ఆయన పడవ ప్రమాదంలో మరణించారనే వార్త రావడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం శుభాకాంక్షలు తెలిపిన వారే, సాయంత్రం నివాళులు అర్పించాల్సి రావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
మృతుల వివరాలు
మొబైల్ కంపెనీ పర్యటనలో భాగంగా వెళ్ళి ప్రమాదానికి గురైన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి:
కుటుంబ సభ్యుల ఆవేదన
మృతుడు షేక్ అబ్దుల్లా ప్రమాదానికి కొన్ని గంటల ముందే తన మనవరాలితో వీడియో కాల్ మాట్లాడారని, జూలై 13 ఉదయం తిరుచ్చి వస్తానని చెప్పారని ఆయన సోదరుడు మహమ్మద్ బావా కన్నీరుమున్నీరయ్యారు. కాగా ప్రస్తుతం మతదేహాలను వియత్నాం రాజధాని పరిసర ప్రాంతాల నుండి భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ వారి మృతదేహాలను వీలైనంత త్వరగా స్వగ్రామాలకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లతో అభ్యర్థిస్తున్నారు.


