పళ్ళిపట్టు: ఇరుల కుటుంబానికి టీవీకే శ్రేణులు రూ. 5 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మించి అప్పగించారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేట కొండ ప్రాంతంలో ఇళ్లులేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇరుల కుటుంబంను ఆదుకునే విధంగా టీవీకే జిల్లా కార్యదర్శి రమేష్ పార్టీ శ్రేణులతో కలిసి వారి సొంత డబ్బులు నుంచి రూ. 5 లక్షల ఖర్చుతో నూతన ఇళ్లు నిర్మించారు. విజయ్ పేరిట నిర్మించిన ఇళ్లు ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు అధ్యక్షత వహించారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లయోలా మణి, సంపత్కుమార్ తదితరులు పాల్గొని కొత్త ఇళ్లు ప్రారంభించి పేద కుటుంబంకు అప్పగించారు. అనంతరం పొదటూరుపేటలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీవీకే శ్రేణులు పాల్గొన్నారు.


