శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డు
సాక్షి, చైన్నె : చిన్నారులకు శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డును మద్రాస్ ఈఎన్టి రీసెర్చ్ ఫౌండేషన్ సృష్టించింది. బుధవారం మద్రాసు ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ కామేశ్వరన్ ఈ వివరాలను ప్రకటించారు. 2004లో మొదటిసారిగా 13 ఏళ్ల బాలికకు ఆడిటరీ ట్రెయిన్ ప్రైమ్ ఇంప్లాంట్ (ఏబీఐ) చికిత్సను నిర్వహించి వినికిడిని పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 2009లో పసికందు కూడా చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 100 వరకు ఆ రకమైన చికిత్స విజయవంతంగా చేసి, కొత్త మైలురాయికి చేరామని వెల్లడించారు. సమావేశంలో వీహెచ్ఎస్ హాస్పిటల్ చీఫ్ న్యూరో సరైన్ డాక్టర్ ఎంసీ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.


