స్మగ్లింగ్‌ కేసులో నలుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌ కేసులో నలుగురి అరెస్టు

Apr 28 2025 1:05 AM | Updated on Apr 28 2025 1:05 AM

స్మగ్

స్మగ్లింగ్‌ కేసులో నలుగురి అరెస్టు

తిరుత్తణి: ఆంధ్రా నుంచి అద్దె కారులో మత్తు మాత్రలు తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారి పొన్పాడి చెక్‌పోస్టు వద్ద ఆదివారం వేకువజామున మద్యపాన నిషేధిత విభాగం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని తిరుపతి నుంచి చైన్నెకు వెళ్లిన కారును నిలిపి తనిఖీ చేయగా నిషేధిత మత్తుమాత్రలు తరలించడాన్ని గుర్తించారు. కారుతో సహా స్వాధీనం చేసుకుని, యువకులు నలుగురిని అరెస్టు చేశారు. వారిని తిరుత్తణిలోని మద్యపాన నిషేధిత విభాగం పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. సీఐ రమేష్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చైన్నె వెస్ట్‌ తాంబరానికి చెందిన కమల్‌(20) తిరుమల దర్శనానికి వెళ్లాలంటూ చైన్నెలో ఓలా కారు బుక్‌ చేసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి పుణెలో 2500 మత్తు మాత్రలు కొనుగోలు చేశాడు. తిరుపతిలోని అతని మిత్రులు వెస్ట్‌ తాంబరానికి చెందిన దేవకన్నన్‌(21), శక్తివేల్‌(20), 17 ఏళ్ల మైనర్‌ బాలుడు సహా నలుగురూ కారులో చైన్నెకు పయనమైనట్లు తెలిపారు. నిషేధిత మత్తు మాత్రలు తరలించిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించగా మైనర్‌ బాలుడికి క్రమశిక్షణ బాలుర వసతి గృహానికి తరలించారు.

స్మగ్లింగ్‌ కేసులో నలుగురి అరెస్టు 1
1/1

స్మగ్లింగ్‌ కేసులో నలుగురి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement