రేపటి నుంచి బీఈడీ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలకు రెగ్యులర్ 3012 మంది, సప్లిమెంటరీకి 568, బీపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ 104, సప్లిమెంటరీకి 19, 4వ సెమిస్టర్ రెగ్యులర్ 71, సప్లిమెంటరీకి 36, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ 84, సప్లిమెంటరీకి 16, 4వ సెమిస్టర్ రెగ్యులర్ 122, సప్లిమెంటరీకి 16 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్ పరీక్ష కేంద్రాల మార్పు కోవెలకుంట్ల: 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లాలోని వివిధ కళాశాలలతోపాటు ఆర్జీఎం, శాంతిరాం కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఇటీవలే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆర్జీఎం, శాంతిరాం కళాశాలల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈ కారణంగా పరీక్ష కేంద్రాల జాబితా నుంచి ఆ రెండు కళాశాలలను తొలగించారు. గతంలో హాల్టికెట్లు పొందిన విద్యార్థులకు ఈ కళాశాలలు పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు అయితే మరలా కొత్తగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, లేకపోతే ఇబ్బంది పడతారని అధికారులు సూచిస్తున్నారు. 16 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి జూన్ 15వ తేదీ వరకు డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షలకు రెగ్యులర్ 7,531 మంది, సప్లిమెంటరీకి 9,167, నాలుగో సెమిస్టర్ రెగ్యు లర్ 6,625,సప్లిమెంటరీకి 9,097 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 3,374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
సప్లిమెంటరీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు కల్చరల్: అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ ఎవాల్యూయేషన్ అధికారులు తెలిపారు. 1994–95 నుంచి 2014 –15 సంవత్సరం వరకు డిగ్రీ చదివి ఫెయిల్ అయిన వారికి పరీక్షలు రాసేందుకు ఒక్క అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫెయిలైన విద్యార్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు www. skuniversity.ac.inవెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.