పుర పోరులో సైనికుల్లా పనిచేయాలి
సూర్యాపేట టౌన్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికలపై దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే మన ఆయుధమని అన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, అధికారం చేపట్టిన కొద్దిరోజుల నుంచే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. అందుకు నిదర్శనం పంచాయతీక ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన అద్భుత ఫలితాలేనన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల కృషి ఎనలేనిదన్నారు. గుర్తులు లేకుండానే అత్యధిక సీట్లు సాధించుకున్నామని, ఇక గుర్తులు ఉండే ఎన్నికలయితే.. కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి


