ఆయకట్టు..
● చుక్క నీరు పారని
తోటపల్లి కాలువ
● బీడు భూములుగా మారుతున్న పంట పొలాలు
● ఆయకట్టు రైతులకు తప్పని పాట్లు
జి.సిగడాం :
తోటపల్లి ఆయకట్టు బీడువారుతోంది. ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల రికార్డుల ప్రకారం తోటపల్లి నీరు జి.సిగడాం మండలం ఆయకట్టు వరకు పారాలి. కానీ ఈ మండలానికి చుక్క నీరు కూడా రావడం లేదు. ఒక పక్క వర్షాలు కురవకపోవడంతోపాటు మరో పక్క సాగునీరు అందకపోవడంతో దమ్ములు లేక పొలా లు బీడు వారుతున్నాయి. వరి నారు వేసి నేటికి 60 రోజులు పూర్తయినా సాగునీరు లేకపోవడంతో ఉభాలు వేయక, నారు ముదిరిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
గదబపాలెం–నడిమివలస గ్రామాల మధ్యలో పిచ్చి మొక్కలతో నిండి ఉన్న కాలువ


