శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కరజాడ గ్రామ సరిహద్దు వంశధార నదీ తీరాన అక్రమంగా నడుస్తున్న ఓ ఇసుక ర్యాంప్పై శ్రీకాకుళం రెవెన్యూ, మైన్స్, రూరల్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలు, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. గడిచిన కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు తహసీల్దార్ గణపతిరావు, రూరల్ ఎస్ఐ సురేష్, మైన్స్ ఆర్ఐ మాణిక్యాలరావు కలిసి దాడులు నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతంలో ఇసుక తరలింపునకు సంబంధించి మైన్స్, రెవెన్యూ అనుమతులు ఇవ్వలేదన్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.


