సచివాలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

సచివాలయంలో చోరీ

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

రణస్థలం: పిసిని గ్రామ సచివాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి పలు వస్తువులు పట్టుకుని వెళ్లిపోయినట్లు పంచాయతీ కార్యదర్శి లండ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం బద్దలుకొట్టి రెండు యూపీఎస్‌లు , సీపీయూ, కీబోర్డు, మానిటర్‌, వెబ్‌ కెమెరా, హెడ్‌ ఫోన్స్‌, ప్రింటర్‌, టీవీ వంటివి దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సచివాలయాన్ని క్లూస్‌ టీం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement