రణస్థలం: పిసిని గ్రామ సచివాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి పలు వస్తువులు పట్టుకుని వెళ్లిపోయినట్లు పంచాయతీ కార్యదర్శి లండ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం బద్దలుకొట్టి రెండు యూపీఎస్లు , సీపీయూ, కీబోర్డు, మానిటర్, వెబ్ కెమెరా, హెడ్ ఫోన్స్, ప్రింటర్, టీవీ వంటివి దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సచివాలయాన్ని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు.


