మెమో 57ను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మెమో 57ను అమలు చేయాలి

Apr 21 2025 12:57 AM | Updated on Apr 21 2025 12:57 AM

మెమో 57ను అమలు చేయాలి

మెమో 57ను అమలు చేయాలి

శ్రీకాకుళం అర్బన్‌: జనవరి 1, 2004కు ముందు నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెమో 57ను తక్షణమే అమలు చేయాలని మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ కొత్తకోట శ్రీహరి డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం మెమో 57 సాధన సమితి జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రాప్తికి అర్హత ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్‌ విధానం వర్తింపజేయాలని కోరారు. ఇందుకు కూటమి ప్రభుత్వం తమ యువగళం పాదయాత్రలో లోకేష్‌ మాట ఇచ్చారని వారు తమ మాట నిలబెట్టుకొని మెమో 57ను అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. జనవరి 1, 2004కు ముందు నోటిఫికేషన్‌ వచ్చి కొన్ని అడ్మినిస్ట్రేటివ్‌ కారణాల వల్ల జాయినింగ్స్‌ లేట్‌ అయినప్పటికీ పీఎఫ్‌ ఆర్‌డీఏ చట్టం అమలుకు ముందే నోటిఫికేషన్‌ వచ్చినందున వీరందరూ పాత పెన్షన్‌కి అర్హులేనని అన్నారు. అందుకోసం అర్హత కలిగిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,000 మందికి పాత పెన్షన్‌ వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement