రైలు ఢీకొని రిక్షా కార్మికుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని రిక్షా కార్మికుడు దుర్మరణం

Published Sat, Mar 15 2025 1:32 AM | Last Updated on Sat, Mar 15 2025 1:33 AM

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ రిక్షా కార్మికుడు మృతిచెందాడు. బెల్లుపడ కాలనీకి చెందిన ఆసి బైరెడ్డి(50) ఎర్రచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా అప్‌లైన్‌ ట్రాక్‌లో తిరుపతి–పూరి ఎక్సప్రెస్‌ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని జీఆర్‌పీ ఎస్సై ఎస్‌కే షరీఫ్‌ తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీఆర్‌పీ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement