చేనేత కార్మికుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుడి ఆత్మహత్య

May 31 2025 2:03 AM | Updated on May 31 2025 2:03 AM

చేనేత కార్మికుడి ఆత్మహత్య

చేనేత కార్మికుడి ఆత్మహత్య

తాడిపత్రి రూరల్‌: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన చాకలి రంగ (45)కు భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాఆపరుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన రంగ... శుక్రవారం కోమలి – జూటూరు గ్రామాల మధ్య ఉన్న పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement