లాభదాయకంగా సాగింది | - | Sakshi
Sakshi News home page

లాభదాయకంగా సాగింది

May 31 2024 12:28 AM | Updated on May 31 2024 12:28 AM

లాభదా

లాభదాయకంగా సాగింది

మార్కెట్‌కు ఈ ఏడాది 1.13 లక్షల క్వింటాళ్లకు పైగా చింత పండు వచ్చింది. దీంతో కమీషన్‌ రూపంలో మార్కెట్‌ యార్డుకు ఆదాయం బాగా కలిసొచ్చింది. వ్యాపారులు సైతం ఈ ఏడాది మంచి ధరలు ఉంటాయని భావించి సరుకు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ ఉంచారు. దీంతో వ్యాపారం లాభదాయకంగా సాగింది. 700 లారీల వరకు సరుకు శీతల గోదాముల్లో నిల్వ ఉంది.

– వేణగోపాలరెడ్డి, కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని, హిందూపురం

ధరలు నిలకడ

హిందూపురం మార్కెట్‌కు కరోనా తర్వాత ఈ ఏడాది చింత పండు, మిర్చి రికార్డు స్థాయిలో వచ్చింది. ధరలు సైతం ఈ ఏడాది నిలకడగా కొనసాగాయి. చింతపండు క్వింటా గరిష్టంగా రూ.33వేలతో అమ్ముడుపోయింది. అలాగే మిర్చి క్వింటా ధర రూ.28 వేల వరకు పలికింది. దీంతో ఈ సారి మార్కెట్‌కు ఆశించిన మేర సరుకు రావడంతో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగాం.

– జి. చంద్రమౌళి, మార్కెట్‌ యార్డు కార్యదర్శి, హిందూపురం

లాభదాయకంగా సాగింది 
1
1/1

లాభదాయకంగా సాగింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement