విద్యుదాఘాతంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jun 3 2023 12:20 AM | Updated on Jun 3 2023 12:20 AM

మృతుడు అమర్‌నాథ్‌ - Sakshi

మృతుడు అమర్‌నాథ్‌

చెన్నేకొత్తపల్లి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గంగినేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల మేరకు.. గంగినేపల్లికి చెందిన అమరనాథ్‌ (37) నూతనంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇంటికి నీరు పెట్టేందుకుగాను వాడుతున్న మోటర్‌కు కనెక్షన్‌ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement